ప్రహరీ గోడ కూలి ముగ్గురికి తీవ్రగాయాలు


కందుకూరు (రంగారెడ్డి జిల్లా) : నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలి ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలైన సంఘటన కందుకూరు పట్టణంలో మంగళవారం జరిగింది. కందుకూరు ఎమ్మార్వో ఆఫీసు ఎదురుగా ఓ ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆ గోడ కూలింది. ముగ్గురు కార్మికులు కూలిన గోడ కింద ఇరుక్కుపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు కాపాడి.. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top