పోలీసుల నుంచి తప్పించుకోబోయి..
హైదరాబాద్: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గూడపూర్కు చెందిన అక్కలపల్లి గణేశ్ (26) పోలీసుల నుంచి తప్పించుకోబోయి శుక్రవారం మృతి చెందాడు. స్నేహితుడు రమేశ్తో కలసి హయత్నగర్ మనుగనూర్ మల్లన్న గుట్ట వద్ద మద్యం సేవిస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు సోదా చేశారు. వారిని విచారించేందుకు వ్యాన్లో ఎక్కించే క్రమంలో గణేశ్ తప్పించుకొవడానికి ప్రయత్నించి పదిహేను మీటర్ల లోతున్న క్వారీలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.