200 కిలోల గంజాయి స్వాధీనం


జి.మాడుగుల(విశాఖపట్నం): అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం కుంబిడిసింగి గ్రామం నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా.. గంజాయి తరలించేందుకు యత్నిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 6 లక్షల విలువైన 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top