ట్రాక్టర్ బోల్తా.. 20 మంది కూలీలకు గాయాలు


ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం వద్ద సోమవారం ఉదయం ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా వారిలో ఎం.రామలక్ష్మి, టి.లలిత, ఎన్.నాగుదర్గకు తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ అశ్వారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సప్పగూడెం నుంచి జమ్మిగూడెం గ్రామంలో మొక్కజొన్న కంకులు విరిచే పనికి వెళుతుండగా ట్రాక్టర్ ఇంజన్ నుంచి ట్రక్కు లింక్ విడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top