రెండు బస్సులు ఢీ: 15 మందికి గాయాలు


నకిరేకల్(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవే ట్ బస్సును ఢీకొట్టిన ఘటనలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.



హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైపాస్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద ఆగి ఉన్న సమయంలో అదే మార్గంలో విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top