రెండు లక్షల చేపలు మృత్యువాత


రాయచోటి (వైఎస్సార్ జిల్లా) : రాయచోటి మండలం కంచలమ్మగండి చెరువులోని చేపలన్నీ మృత్యువాతపడ్డాయి. సుమారు 2 లక్షల చేపలు మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. భారీ స్థాయిలో ఉన్న ఎండలకు చేపలు చనిపోయాయా లేక ఎవరైనా నీటిలో మందు కలిపారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై చేపల కాంట్రాక్టర్ రెడ్డయ్య, నీటి సంఘం అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నీటి నమూనాలను పరీక్షల కోసం తిరుపతి పంపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top