తాటిచెట్టు విరిగిపడి ముగ్గురి దుర్మరణం
స్టేషన్ఘన్పూర్: ఎండిన తాటి చెట్టు వారి పాలిట శాపమైంది. ఎండిన తాటి చెట్టు విరిగిపడి ఇద్దరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సిర్పూర్గుట్ట వద్ద శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన కొందరు కూలీలు సిర్పూర్గుట్ట వద్ద రాళ్లు కొట్టేందుకు వచ్చారు. అక్కడే గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా బలమైన గాలులు వీయటంతో కూలీల గుడిసెల పక్కనే ఉన్న ఎండిపోయిన తాడిచెట్టు కూలి వారిపై పడింది.
గ్రామానికి చెందిన ఎత్తరి రాణి(38), ఆమె కుమారుడు శ్రీకాంత్(18), కూతురు కల్యాణి(12) ఆరు బయట నిద్రించారు. ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులకు ఆ పక్కనే ఉన్న ఎండిన తాడిచెట్టు వారిపై కూలి పడింది. దీంతో రాణి, కల్యాణి అక్కడికక్కడే చనిపోయారు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొంతుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా మరణించాడు. మృతి చెందిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.