ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వివాదం
భీమవరం: పశ్చిమగోదావరిజిల్లా భీమవరం పట్టణంలో ఇద్దరు ప్రముఖ సినీ హీరోల అభిమానుల మధ్య వివాదం నెలకొంది. ఒక హీరోకు చెందిన ఫ్లెక్సీని మరో హీరో అభిమానులు బుధవారం రాత్రి అడ్డవంతెన ప్రాంతంలో చించివేశారన్న ఆరోపణతో సదరు హీరో అభిమానులు ఆందోళనకు దిగారు. మరో హీరో అభిమానులు కూడా తమ అభిమాన నటుని ఫ్లెక్సీలు చించివేశారని పోలీసులను ఆశ్రయించారు.
తమ హీరో ఫ్లెక్సీలు చించివేయడంతోపాటు రెండు ఏటీఎంలు, కొన్ని వాహనాలను ధ్వంసం చేసినట్టు రెండో పట్టణ పోలీసులకు రౌతు ఏసు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీని గుర్తు తెలి యని వ్యక్తులు చించివేశారని మరో హీరో అభిమాన సంఘానికి చెందిన ఎం.వెంకటేశ్నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రెండవ పట్టణ సీఐ ఎం.రమేష్బాబు తెలిపారు. కాగా, బుధవారం రాత్రి ఏర్పడిన ఈ వివాదం గురువారం కూడా కొనసాగింది. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ అమలులో పెట్టారు.