18 ఎర్రచందనం దుంగలు పట్టివేత


చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అడవుల్లో మరోసారి ఎర్రచందనం దుంగలతోపాటు కూలీలు పట్టుబడ్డారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా మంగళవారం ఉదయం సచ్చినోడుబండ సమీపంలో కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా వారికి ఎదురైన ఎర్ర చందనం కూలీలు... దుంగలను వదిలేసి కాలికి బుద్ధిచెప్పారు. అయితే, పోలీసులు  8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఆరుగురు చంద్రగిరి మండలం రంగపేటవాసులుగా తేలింది.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top