విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వరంగల్: కురవి మండలం నేరడలోని ఆదర్శ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. చింతపల్లి శివారు బీరావత్ తండాకు చెందిన తేజావత్ సోమ్లా, మంగమ్మల కుమార్తె అయిన ఈమె అమ్మమ్మ వద్ద ఉంటూ పదో తరగతి చదువుతోంది. వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించాల్సిన సమయం కావడంతో పరీక్షలపై భయంతో మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వస్తూ పురుగుల మందు తాగింది. తోటి విద్యార్థులు గమనించి ఆమెను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. తల్లిదండ్రులు హైదరాబాద్లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు.
సంబంధిత వార్తలు