104 ఏళ్లలోనూ అన్నీతానై..
104 ఏళ్లలోనూ అన్నీతానై..
చౌడేపల్లె : వయస్సులో ఉండి పనీపాట లేకుండా తిరిగే వారు ఈ రోజుల్లో చాలామందే ఉన్నారు. అలాంటి వారు పుంగనూరు మండలం చదళ్లకు చెందిన ఆర్.గోవిందరెడ్డిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన వయస్సు 104 ఏళ్లు. ఇప్పటికీ ఆయన తన పనులు తానే చేసుకుంటాడు. ఇంట్లోని రెండు పాడి ఆవులకు మేత తీసుకొస్తాడు. క్రమం తప్పకుండా ఆవులకు పౌష్టికాహారం అందిస్తూ రోజుకు 20 లీటర్ల పాలు అమ్ముతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.