నూరేళ్ల పండుగ
నూరేళ్లు పిల్లపాపలతో చల్లగా ఉండాలి.. ఆశీర్వచనం అంటే పెద్దల నోట వినిపించే మాట ఇది. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించటం అంటే నేటి ఆధునిక యుగంలో సాధ్యం కాదనేది సాధారణంగా వినిపించే మాట. మండల కేంద్రం దుగ్గిరాలకు చెందిన జంపాల రమామణి పరుచూరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101లోనికి అగుడుపెట్టారు. అదే గ్రామానికి చెందిన ఒడుగు బసవయ్య 102వ వసంతంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన జంపాల వారసులు ఆదివారం జంపాల వారి కళ్యాణ మండపంలో వీరిద్దరికీ వేర్వేరుగా నూరు వసంతాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీరి ఆశీస్సులు పొందారు. – దుగ్గిరాల