బస్సు బోల్తా: 10 మందికి గాయాలు


విజయవాడ: కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి వద్ద శుక్రవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


విజయవాడ - విశాఖ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు.  

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top