రోడ్డు ప్రమాదంలో 10మందికి గాయాలు
తూర్పుగోదావరి: జిల్లాలోని తుని మండలం ఎర్రకోనేరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం నుంచి అన్నవరం వెళ్తున్న టాటాఏస్ ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టాటాఏస్ లో ఉన్న 10 మంది గాయాలపాలయ్యారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.