వైఎస్ఆర్ సీపీ ఎన్నారై కమిటీ నియామకం


హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...ఆస్ట్రేలియా, మలేసియా దేశాల్లో పార్టీ ఎన్నారై  విభాగానికి సంబంధించిన పలు నియామకాలు చేపట్టినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియా ఎన్నారై కమిటీ కన్వీనర్గా రమణారెడ్డి కుంజుల, కో-కన్వీనర్గా రాజశేఖర్ లంకెల నియమితులయ్యారు. వీరితో పాటు ప్రాంతీయ ఇన్ఛార్జిలను నియమించారు.



మలేషియా ఎన్నారై కమిటీ కో-కన్వీనర్లుగా విజయభాస్కర్ రెడ్డి లేబాకు, గోపాల్ సత్తిరాజు, మహేష్ బాబు కనమల, రక్షిత్ కుమార్ ఆకేపాటి, కోటిరెడ్డి ఆళ్ల నియమితులయ్యారు. ఇంకా పలువురిని వివిధ కమిటీల్లో నియమించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top