బెల్ఫాస్ట్ లో ఉగాది సంబరాలు

బెల్ఫాస్ట్ లో ఉగాది సంబరాలు


బెల్ఫాస్ట్: ఈ ఏడాది మార్చ్ 21 న ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు  నార్తన్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్ (ఎన్ఐటీఏ) ఏర్పాటు చేస్తుంది.  ప్రముఖ గాయకులు హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి తమ పాటలతో బెల్ఫాస్ట్ తెలుగు ప్రజలను అలరించనున్నారు. ఈ ఉగాది కార్యక్రమం విక్టోరియా కాలేజీలో జరుగుతుందని ఎన్ఐటీఏ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచంగ శ్రవణం , బాలీవుడ్ డాన్స్ , టాలీవుడ్ డాన్స్ , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉగాది విందు భోజన కార్యక్రమం మార్చ్ 21 న మధ్యాహ్నాం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ముఖ్య అతిథులుగా బెల్ఫాస్ట్ మేయర్, లార్డ్ రానా లు విచ్చేస్తున్నారు.  



 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top