నోకియాలో వీఆర్ఎస్ లొల్లి
చెన్నై: తమిళనాడులోని శ్రీపెరంబుదూరు ప్లాంటులో ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విమరణ (వీఆర్ఎస్) పథకాన్ని వినియోగించుకోవాలా, వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది ఉద్యోగులేనని మొబైల్ హ్యాండ్సెట్ల దిగ్గజం నోకియా స్పష్టం చేసింది. వీఆర్ఎస్ తీసుకోవాల్సిందిగా తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఉద్యోగులు ఆరోపించిన నేపథ్యంలో కంపెనీ మంగళవారం ఈ వివరణ ఇచ్చింది. కాగాతమపై బలవంతం గా వీఆర్ఎస్ను రుద్దుతున్నారని నోకియా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వ జోక్యాన్ని కోరాలని చెన్నైలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగులు నిర్ణయించారు. పదవీ విరమణ ఐచ్ఛికమే (ఆప్షనల్) కానీ, తప్పనిసరి కాదని యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని కోరుతున్నారు. వీఆర్ఎస్ తీసుకోని ఉద్యోగులకు రవాణా సౌకర్యాన్ని కంపెనీ ఆపేసిందని వారు చెప్పారు.