దక్షిణాసియా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్కు ఐఏఎస్ అక్రిడిటేషన్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని టీయూవీ సుడ్ దక్షిణాసియా ఫుడ్టెస్టింగ్ ల్యాబ్కు ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ సర్వీస్(ఐఏఎస్) గుర్తింపు లభించింది. టీయూవీ సుడ్ ల్యాబ్లో పరీక్షించే ఆహార ఉత్పత్తులు అంతర్జాతీయ అక్రిడిటేషన్ బాడీ, ఐఎస్వో/ ఈఐసీ 17025లో నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నట్టుగా గుర్తించారు.
మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, రా, కుక్డ్, రెడీ టూ ఈట్ ఆహారం, తాగునీరు, పండ్లు కూరగాయాల్లో ప్రమాదం కల్గించే బ్యాక్టీరియా ఈ-కోలీ, సాల్మోనెల్లా జాతులు, ఇన్యుమరేషన్ ఆఫ్ కోలిఫార్మ్, ఈస్ట్ అండ్ మౌల్డ్కౌంట్ ఉన్నాయో లేదో పరీక్షించడానికి అవసర మైన మైక్రోబయాలజికల్ పరీక్షలు చేయడానికి అనుమతించారు. టీయూవీ సుడ్ దక్షిణాసియా టెస్టింగ్,సర్టిఫికేషన్ అండ్ ఇన్స్పెక్షన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పంకజ్జైమినీ మాట్లాడుతూ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎఎస్ నుంచి అక్రిడిటేషన్ పొందిన మొట్టమొదటి లేబరేటరీగా నిలవడం గౌరవంగా ఉందన్నారు.