టీసీఎస్ మార్కెట్ విలువ 5 లక్షల కోట్లు!
ముంబై: భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ కాపిటల్ కలిగిన తొలి కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అవతరించింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటల్ 5 లక్షల కోట్ల రూపాయలకు చేరింది.
భారత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత టీసీఎస్ మార్కెట్ కాపిటల్ 5,06,703.34 (84 బిలియన్ డాలర్లు) కోట్లకు చేరింది. 2004లో లిస్టైన తర్వాత కంపెనీ ఈ ఘనతను సాధించడం ఇదే తొలిసారి.
టీసీఎస్ తర్వాత ఇన్పోసిస్ (1,92,196.84 కోట్లు), హెచ్ సీఎల్ టెక్నాలజీ (1,07,880.18 ), విప్రో (1,40,474.31), టెక్ మహీంద్ర (50,374.76 ) అత్యధిక మార్కెట్ కాపిటల్ కలిగిన కంపెనీలుగా ఉన్నాయి.