రికార్డు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం స్టాక్ మార్కెట్లు రికార్డు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 292.20 పాయింట్లు లాభపడి రికార్డు స్థాయిలో 29,571 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 74.90 పాయింట్లు ఎగబాకి తొలిసారి 8,910 మార్క్ చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్ల నిధుల సాయంతో్ మార్కెట్ల జోరు కొనసాగుతోందని నిపుణులు భావిస్తున్నారు.