లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
ముంబై: శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 26,128 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 7,942 పాయింట్ల వద్ద ముగిసింది. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర 25,810 రూపాయలుగా ఉంది. డాలర్తో రూపాయి మారకపువిలువ 66.7 రూ వద్ద కొనసాగుతుంది.