దక్షిణాదిన రేస్ పవర్ ప్రాజెక్టులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సోలార్ ఈపీసీ రంగ సంస్థ రేస్ పవర్ ఇన్ఫ్రా పవన విద్యుత్, పంపిణీ రంగంలోకి ప్రవేశించింది. రాజస్తాన్లోని జైసల్మేర్ వద్ద 160 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణంతోపాటు 220 కేవీ సబ్ స్టేషన్, ట్రాన్స్మిషన్ లైన్ను పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రాజెక్టులు మరిన్ని చేపడతామని రేస్ పవర్ డెరైక్టర్ కేతన్ మెహతా తెలిపారు. ఇందుకు రూ.200 కోట్లు వెచ్చిస్తామని, 2016 నాటికి వీటిని పూర్తి చేస్తామన్నారు. ఈ రంగంలో సంస్థ ఇప్పటికే 100 మెగావాట్లకుపైగా ఈపీసీ ప్రాజెక్టులను పూర్తి చేసింది. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో 2015 చివరికల్లా మరో 150 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించనుంది.