లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబయి : వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 27541 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిప్టీ 21 పాయింట్ల లాభంతో 8363 పాయింట్ల వ ద్ద ట్రేడవుతోంది. ఇక సెక్టార్ సూచీల్లో 1.88శాతం, టెక్ సూచీలు 1.34శాతం, క్యాపిట్ గూడ్స్ 0.98శాతం లాభాల్లో ట్రేడవుతన్నాయి.
ఇక నిఫ్టీ టాప్ గేయినర్స్ లిస్ట్లో హిందాల్కో 2.82శాతం, ఇన్ఫి 2.57శాతం, టిసిఎస్ 2.05శాతంలాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్లో డాక్టర్ రెడ్డీస్ 1.73శాతం, హిరోమోటో కార్ప్ 1.61శాతం,సన్ ఫార్మా 1.35శాతం నష్టపోతున్నాయి.
మరిన్ని వార్తలు