లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబై: స్టాక్మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 127 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 28,076 దగ్గర, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 8,480 దగ్గర ట్రేడవుతున్నాయి. గ్రీస్ సంక్షోభం భారతీయ ఆర్థిక వ్యవస్థను పెద్దగా ప్రభావితం చేయదనే ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ ప్రకటన ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్లున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఆటో, ఎఫ్ఎంసీజీ, పవర్ , బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల ట్రెండ్ నెలకొంది.
మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి బలపడింది. 11 పైసలు లాభపడి 63.40 దగ్గర ఉంది.