26 వేల దిగువన సెన్సెక్స్!
ఆటో, బ్యాంకింగ్, ఆయిల్, గ్యాస్, మెటల్ రంగాల కంపెనీల షేర్లులో అమ్మకాల ఒత్తిడి ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన సూచీ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ లో 216 పాయింట్లు, నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయాయి.
మధ్యాహ్నం 1.40 నిమిషాలకు సెన్సెక్స్166 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి ట్రేడ్ అవుతున్నాయి.
కెయిర్న్ ఇండియా, హెచ్ సీఎల్ టెక్, పీఎన్ బీ, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, ఇండస్ ఇండియా బ్యాంక్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
డీఎల్ఎఫ్, కోల్ ఇండియా, ఏసీసీ, అల్ట్రా టెక్ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.