నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు


ముంబై:    దేశీయ మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో 145 పాయింట్లకు పైగా నష్టపోయిన   బాంబే స్టాక్ఎక్సేంజ్ సెన్సెక్స్  ఆ తర్వాత కోలుకొంది సెన్సెక్స్120 పాయింట్ల నష్టంతో  27,407  దగ్గర,  నిఫ్టీ 50 పాయింట్లు  నష్టపోయి, 8,259 దగ్గర ట్రేడవుతున్నాయి.

ఆటో ఐటి, మీడియా  అండ్ ఎంటర్టైన్మెంట్, రియాల్టీ  షేర్లు  బాగా నష్టపోతున్నాయి.   సెన్సెక్స్, నిఫ్టీ రెండూ మద్దతు  స్థాయికి దిగువన  ట్రేడవుతున్నందువల్ల  ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని ఎనలిస్టులు  సూచిస్తున్నారు.  

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top