స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 28, 121 l నిఫ్టీ8611 దగ్గర మొదలయ్యాయి. అటు ఆసియన్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆయల్ అండ్ గ్యాస్ సెక్టార్ కు కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. ఫెడ్ రేట్ల అంచనాలతో డాలర్ బలహీనంగా ఉండగా చైనా యెన్ బలపడింది. అమెరికా, జపాన్ కేంద్ర బ్యాంకు సమావేశాలు , ఆయిల్ సెక్టార్ లో బలహీనతకారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహిరంచాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు.
అటు డాలర్ తోపోలిస్తే రూపాయి బలహీంగా ఉంది. 0.29పైసలనష్టంతో 67.37 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రా.ల పుత్తడి రూ. 38 లాభంతో 30,990 దగ్గర ఉంది.
మరిన్ని వార్తలు