స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో వరుస లాభాలకు తెర దించుతూ భారత స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్ల నష్టంతో 26338 వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు క్షీణించి 7876 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
సన్ ఫార్మా, సిప్లా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, కొటాక్ మహీంద్ర కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్ జీసీ, ఐడీఎఫ్ సీ, పీఎన్ బీ, అల్ట్రా టెక్ సిమెంట్, యాక్సీస్ బ్యాంక్ నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.
మరిన్ని వార్తలు