సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు ముగింపు
ఐటీ, ఆటో, ఆయిల్, గ్యాస్, బ్యాంకింగ్, ఫార్మా రంగాల కంపెనీ షేర్లు మద్దతుగా నిలవడం, గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత లాంటి అంశాలు భారత స్టాక్ మార్కెట్ ను నూతన చారిత్రాత్మక గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో నిఫ్టీ 7809, సెన్సెక్స్ 26,188 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.
ఇన్పోసిస్ అత్యధికంగా 3.58 శాతం, బీపీసీఎల్ 3, హిండాల్కో 2.92, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.60, విప్రో 2.17 శాతం లాభాల్ని నమోదు చేసుకుని ప్రధాన సూచీలకు మద్దతుగా నిలిచాయి.
అంబుజా సిమెంట్స్ 3.25 శాతం నష్టపోగా, అల్ట్రా టెక్ సిమెంట్స్ 2.73, ఏసీసీ 2.36, ఐడీఎఫ్ సీ 2.08, కొటాక్ మహీంద్ర 1.73 శాతం నష్ట్రాల్ని నమోదు చేసుకున్నాయి.
మరిన్ని వార్తలు