మూడో రోజు కూడా సెన్సెక్స్ రికార్డు హై!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు రికార్టు స్థాయి వద్ద ముగిసాయి. మంగళవారం నమోదు చేసిన 22,853 పాయింట్ల గరిష్ట స్థాయిని అధిగమించి 22912 పాయింట్లను తాకింది. కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ కొనుగోళ్లు, ఆయిల్, గ్యాస్ సెక్టార్లలో అమ్మకాలు జోరు కనిపించాయి.
డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజున 118 పాయింట్ల లాభంతో 22876 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల వృద్దితో 6840 వద్ద ముగిసాయి.
సూచీ అధారిత కంపెనీ షేర్లలో బ్యాంక్ ఆఫ్ బరోడా అత్యధికంగా 3.34 శాతం, కొటాక్ మహీంద్ర, లార్సెన్, పీఎన్ బీ, అంబూజా సిమెంట్స్ లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
కెయిర్న్ ఇండియా, డీఎల్ఎఫ్, ఐడీఎఫ్ సీ, బీపీసీఎల్, అల్ట్రా టెక్ సిమెంట్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిసాయి.
మరిన్ని వార్తలు