సెన్సెక్స్ 106 పాయింట్స్ ర్యాలీ


జీఎస్టీ బూస్ట్ తో ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, చివరికి పాజిటివ్ గానే ముగిశాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు ర్యాలీ జరిపి 30570.97 వద్ద, నిఫ్టీ 10.35 పాయింట్ల లాభంలో 9438.25 వద్ద క్లోజయ్యాయి. ప్రారంభంలో 48 పాయింట్లకు పైగా ఎగిసిన నిఫ్టీ 9450 స్థాయికి పైననే ట్రేడవ్వగా.. తర్వాత మార్కెట్లో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడితో 9450 స్థాయికి కింద ముగిసింది. ఐటీసీ, భారతీ  ఇన్ ఫ్రాటెల్, లార్సెన్ అండ్ టర్బోలు రెండు సూచీల్లో లాభాలు పండించగా.. స్టేట్ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, లుపిన్ నష్టాలు పాలయ్యాయి.

 

గతసెషన్ లో నష్టాలు పాలైన మిడ్ క్యాప్స్, సోమవారం కూడా నష్టాల్లోనే కొనసాగాయి. 2016 డిసెంబర్ క్వార్టర్ లో నికర లాభాలను నమోదుచేసిన స్టేట్ బ్యాంకు ఆఫ్‌ ఇండియా తదుపరి మార్చి క్వార్టర్ లో నికర నష్టాలను నమోదుచేయడంతో బ్యాంకు షేరు భారీగా పతనమైంది. నేటి ఇంట్రాడేలో 9 శాతం పైగా నష్టపోయింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి, 64.56 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా 26 రూపాయల లాభంలో 28,661 వద్ద నమోదయ్యాయి.  

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top