రామ్ చరణ్ తేజ.. టర్బో మేఘ
ప్రముఖ సినిమా హీరో, చిరంజీవి కొడుకు, రామ్ చరణ్ తేజ విమానయాన వ్యాపారంలోకి ప్రవేశించారు. టర్బో మేఘ పేరుతో విమానయాన కంపెనీని ప్రారంభించారు. విమాన సర్వీసులను నడపటానికి ఈ సంస్థకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) లభించింది. కాగా ఏఓపీ/ఫ్లయింగ్ లెసైన్స్ కోసం ఈ కంపెనీ డీజీసీఏకు దరఖాస్తు చేసి అనుమతి పొందాలి. ఈ అనుమతి పొందడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని అంచనా. కాగా ఈ కంపెనీకి రామ్ చరణ్ తేజ, వంకాయల పాటి ఉమేశ్ డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
రామ్ చరణ్ తేజ ఇప్పటికే హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ను సొంతం చేసుకోగా, మా నెట్వర్క్లో వాటా ఉంది. టర్బో మేఘ కంపెనీతో పాటు ఎయిర్ కార్నివాల్, జవ్ ఎయిర్వేస్, ఎయిర్ వన్ ఏవియేషన్, ప్రీమియర్ ఎయిర్, జెక్సస్ ఎయిర్... మొత్తం ఆరు కంపెనీలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ)లను జారీ చేసింది.