మార్కెట్లోకి జియోని మారథాన్ ఎం5 స్మార్ట్‌ఫోన్

మార్కెట్లోకి జియోని మారథాన్ ఎం5 స్మార్ట్‌ఫోన్


హైదరాబాద్: జియోని కంపనీ మారథాన్ ఎం5 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర రూ.17,999 అని, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని  కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో 6,020 ఎంఏహెచ్ బ్యాటరీ(ఒక్కోటి 3,100 ఎంఏహెచ్ ఉన్న రెండు బ్యాటరీలు) ఉండడం విశేషమని పేర్కొంది.   ఈ ఫోన్ రివర్స్ చార్జింగ్(ఇతర డివైస్‌లను చార్జింగ్ చేసే పవర్‌బ్యాంక్‌గా పనిచేయడం)ను సపోర్ట్ చేస్తుందని అయితే ఈ రివర్స్ చార్జింగ్ కేబుల్‌ను విడిగా కొనుగోలు చేయాలని తెలిపింది.



4జీని సపోర్ట్ చేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ ఓఎస్‌పై పనిచేస్తుంది. 64-బిట్ 1.5 గిగా హెట్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ఎంటీ6735 ప్రాసెసర్‌తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో  13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ఇతర గృహోపకరణాలకు రిమోట్ కంట్రోల్‌గా కూడా ఈ మారథాన్ ఎం5 స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుందని తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top