భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రెండోసారి పెరిగాయి. గతంలో స్వల్పంగా పెరగగా, ఈసారి భారీగా పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 3.18 రూపాయలు పెరిగింది. ఇక లీటర్ డీజిల్పై 3.09 రూపాయలు పెరిగింది. శనివారం అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. కొత్త ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ 68 రూపాయలకు, లీటర్ డీజిల్ ధర 56 రూపాయలకు చేరుకోనుంది.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే ధరలు పెరిగాయి. ఇదే నెలలో లీటర్ పెట్రోల్ పై 82 పైసలు పెంచగా, లీటర్ డీజిల్ పై 61 పైసలు పెంచారు.