మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌

మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌


ప్రారంభ ధర రూ.32,999

ముంబై: చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్‌’ తాజాగా ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది 6 జీబీ ర్యామ్‌/64 జీబీ మెమరీ, 8 జీబీ ర్యామ్‌/128 జీబీ మెమరీ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్లమర్లకు అందుబాటులో ఉండనుంది. వీటి ధరలు వరుసగా రూ.32,999, రూ.37,999గా ఉన్నాయి.



వినియోగదారులు ఈ ఫోన్లను అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల ఫుల్‌–హెచ్‌డీ స్క్రీన్, ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్, 16 ఎంపీ+ 20 ఎంపీ రియర్‌ డ్యూయెల్‌ కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top