ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్పై దర్యాప్తునకు కొత్త ఏజెన్సీ
బాలియా (ఉత్తరప్రదేశ్): నోట్ల రద్దు అనంతరం అసాధారణంగా దాఖలు చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్పై దర్యాప్తు చేసేందుకు కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు.
నోట్ల రద్దు తర్వాత మొత్తం రూ. 15 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు ఆయన తెలిపారు. నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో 18 లక్షల మంది చేసిన డిపాజిట్లు, వారి పన్ను చెల్లింపుల వివరాలతో సరిపోలేదని, వారందరికీ ఆదాయ వివరాలను తెలపాలంటూ నోటీసులు పంపినట్లు చెప్పారు.