మార్కెట్లోకి... కాయకల్ప్ బయో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పురుగుమందుల తయారీ సంస్థ ఇన్సెక్టిసైడ్స్ (ఇండియా) తన బయో ఉత్పత్తి ‘కాయకల్ప్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది భూమిని సారవంతం చేసి.. నీటి నిలుపుదల శక్తిని పెంచుతుందని.. తద్వారా మొక్కను నీటి ఒత్తిడి నుంచి రక్షించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు సహాయపడుతుందని కంపెనీ ఎండీ రాజేష్ అగర్వాల్ తెలిపారు. కాయకల్ప్ వినియోగంతో నేలపై రసాయనాల వినియోగం 25 శాతం వరకు తగ్గుతుందని ఒక ప్రకటనలో చెప్పారాయన.
మరిన్ని వార్తలు