భారత్లో జోలా తొలి స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: జోలా కంపెనీ తన తొలి హ్యాండ్సెట్ను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సెయిల్ఫిష్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ ఫోన్ ధర రూ.16,499. ఆన్లైన్ మార్కెట్ప్లేస్ స్నాప్డీల్ ద్వారా ఈ మొబైల్ ఫోన్ను అందిస్తున్నామని జోలా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్క్ డిల్లన్ చెప్పారు. నోకియాలోని మాజీ ఉద్యోగులు కొందరు జోలా కంపెనీని స్థాపించారు. నోకియా మీగో సాఫ్ట్వేర్ స్ఫూర్తితో సెయిల్ఫిష్ ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేశారు.
ఈ జోలా ఫోన్లో 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 1.4 గిగాహెర్ట్స్ డ్యుయల్ కోర్ క్వాల్కామ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1 జీబీ ర్యామ్, 16 జీబీ మెమొరి వంటి ప్రత్యేకతలున్నాయని డిల్లన్ వివరించారు. సెయిల్ఫిష్ ఓఎస్పై పనిచేసే స్మార్ట్ఫోన్ల తయారీలో భారత భాగస్వామి కోసం చూస్తున్నామని పేర్కొన్నారు.
స్మార్ట్ఫోన్ల విషయంలో ఆండ్రాయిడ్ ఓఎస్దే హవా అని ఆయన అంగీకరించారు. అయితే వినియోగదారులు ఎంచుకోవడానికి ఆప్షన్లు ఉండాలని చెప్పారు. సైగలు ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ యాప్లకు కంపాటిబిల్గా ఉంటుందని పేర్కొన్నారు. కొత్తదనం, విభిన్నత కోరుకునే వారకి ఈ స్మార్ట్ఫోన్ గొప్ప ప్రత్యామ్నాయమని స్నాప్డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోనీ నవీన్ తెలిపారు.