జెట్ ఎయిర్వేస్ ట్రావెల్ ప్యాకేజీలు

జెట్ ఎయిర్వేస్ ట్రావెల్ ప్యాకేజీలు


హైదరాబాద్: ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ తాజాగా ‘ప్రేమికుల రోజు’ సంద ర్భంగా వినియోగదారుల కోసం ‘జెట్‌ఎస్కేప్స్’ పేరుతో పలు రకాల ట్రావెల్ ప్యాకేజీలను ప్రకటించింది. గోవా, జైపూర్, కేరళ, న్యూఢిల్లీ-ఆగ్రా, రణథంబోర్, సాసాన్ గిర్ ప్రాంతాలకు సంబంధించిన ట్రావెల్ ప్యాకేజీలను భార్యాభర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి నెల మొత్తం అందుబాటులో ఉండనున్న ఈ ప్యాకేజీల ధర రూ.31,975 (ఒక కపుల్‌కి) నుంచి ప్రారంభమౌతుందని పేర్కొంది. ఇందులోనే ఎకానమీ తరగతి రిటర్న్ టికెట్లు, హోటల్ బుకింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి వ్యయాలు కలిసి ఉంటాయని తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top