టెక్ కుబేరుల్లో మనోళ్లు ముగ్గురు

టెక్ కుబేరుల్లో మనోళ్లు ముగ్గురు


సింగపూర్: ఆసియా అగ్రశ్రేణి పది టెక్నాలజీ కుబేరుల్లో ముగ్గురు భారతీయులకు స్థానం దక్కింది. పరిశ్రమ వర్గాలు, ఇటీవల మార్కెట్ డేటా ప్రకారం... విప్రో అజిమ్ ప్రేమ్‌జీ 1,600 కోట్ల డాలర్ల సంపదతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. సింగపూర్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సింగపూర్ ఇన్నోవేషన్ లీగ్ అధినేత నీరజ్ గోయల్ 1,295  కోట్ల డాలర్ల సంపదతో ఆరో స్థానంలో ఉన్నారు. 45 ఏళ్ల వయసున్న నీరజ్ ఈ జాబితాలోని అత్యంత పిన్నవయస్కుడు. 2000 సంవత్సరాల నుంచి ఈయన సింగపూర్‌లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చెందిన శివ్ నాడార్ 1,170 కోట్ల డాలర్లతో ఏడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలోని ముగ్గురు భారతీయుల మొత్తం సంపద 4,065 కోట్ల డాలర్లుగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top