ఎక్స్‌ట్రీమ్‌లో కొత్త వేరియంట్

ఎక్స్‌ట్రీమ్‌లో కొత్త వేరియంట్


ధర రూ. 72,725

న్యూఢిల్లీ:
హీరోమోటోకార్ప్ కంపెనీ 150 సీసీ కేటగిరీలో అప్‌డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ పేరుతో ఈ అప్‌డేటెట్ వేరియంట్‌ను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఈ బైక్ దర రూ.72,725 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని పేర్కొంది. కొత్త రకంగా డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్, ట్విన్ ఎల్‌ఈడీ పైలట్ ల్యాంప్స్ తదితర ప్రత్యేకతలున్నాయని వివరించింది. శక్తివంతమైన ఇంజిన్, స్టైల్‌ల కలబోతగా రూపొందించిన ఈ బైక్‌కు మంచి ఆదరణ లభించగలదని కంపెనీ ఆశిస్తోంది. గత నెలలో కంపెనీ అందించిన రెండవ ఉత్పత్తి ఇది. గత నెల ప్రారంభంలో ప్యాషన్ ప్రొలో అప్‌డేటెడ్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top