మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు - Sakshi


ముంబయి : కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న బంగారం ధరలు మళ్ళీ కొండెక్కాయి. అంతర్జాతీయంగా ఔన్స్‌ బంగారం ధర 1200 డాలర్లకు చేరడంతో పాటు ఆభరణాల వర్తకుల నుంచి డిమాండ్‌ రావడం బంగారం ధరలు పెరగడానికి కారణమైంది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 400 పెరిగి 26వేల 950 రూపాయలకు చేరింది.



ఇక వెండి ధర సైతం కిలో 950 రూపాయలు పెరిగి 38వేల 750 రూపాయలకు చేరింది.  మధ్య ఆసియాలో నెలకొన్న అనిశ్చితి వాతావరణంతో  పెట్టుబడికి అనుకూలమైన సాధనంగా బంగారాన్ని భావించడం పసిడి ధరలు ఇంతలా పెరిగేందుకు కారణమైంది. ఇక హైదరాబాద్‌ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 25 వేల 240 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 27వేల 20 రూపాయలుగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top