భారత్ మార్కెట్లోకి నేడే ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ఫోన్ను నేడు(సోమవారం) భారత మార్కెట్లోకి తేనున్నది. ఈ ఫోన్లను ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్లు అందించనున్నదాయి. సుమారుగా వంద డాలర్ల (రూ.6,000) ధర ఉన్న ఈ ఆండ్రాయిడ్ వన్ కారణంగా వేగంగా వృద్ధి చెందుతున్న భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో పోటీ మరింత తీవ్రమవుతుందని అంచనా.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను మరింత మందికి అందుబాటులోకి తేవడానికి వీలుగా ఇలా వంద డాలర్ల లోపు ధర ఉన్న స్మార్ట్ఫోన్ను అందించనున్నామని గూగుల్ సంస్థ ఈ ఏడాది జూన్లో వెల్లడించింది. స్పైస్, కార్బన్లు రూపొందించిన గూగుల్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ఫోన్లను ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్లు, మైక్రోమ్యాక్స్ రూపొందించిన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ఫోన్ను అమెజాన్ ఇండియా విక్రయించనున్నాయి. ఈ మూడు సంస్థలు ఈ ఫోన్ ఆవిష్కరణ గురించి ఇప్పటికే ఆకర్షణీయమైన టీజర్లను విడుదల చేశాయి.