దివీస్ ల్యాబ్ నికర లాభం 231 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దివీస్ ల్యాబ్ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక నికరలాభంలో 18 శాతం వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఇదే కాలానికి రూ. 196 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ త్రైమాసికంలో రూ. 231 కోట్లకు చేరింది. రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేరుకు 1,000 శాతం డివిడెండ్ను కంపెనీ ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రతీ షేరుకు రూ. 20 డివిడెండ్ లభించనుంది.