ఐసీఐసీఐతో డిష్ టీవి ఒప్పందం
ముంబై: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా ప్రముఖ డీటీహెచ్ సంస్థ డిష్ టీవీ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తో జతకట్టింది. దీనితో పాటు యూపీఐ పేమెంట్ ద్వారా రీచార్జ్ చేసుకునే వెసులుబాటు కల్సించినట్లు డిష్ టీవీ ఛీఫ్ ఎగ్జిగూటివ్ అధికారి అర్జున్ కపూర్ ఓ ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా ఎక్కువమంది ఖాతాదారులను డిజిటల్ పేమెంట్లు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు అర్జున్ తెలిపారు. ఇంటర్నెట్ లేకుండానే డిష్ టీవీ రీచార్జ్ చేసుకోవచ్చని చెప్పారు.
ఐసీఐసీఐ సీనియర్ జనరల్ మేనేజర్ బెనర్జీ మాట్లాడుతూ డిష్ టీవీతో ఒప్పందం కుదుర్చుకోవడం తమకు సంతోషంగా ఉందని, డిష్టీవీ రెన్యువల్ చేసుకోవడానికి ఐసీఐసీఐ బ్యాంకు మొబైల్ యాప్లో భీమ్ తరహాలో ప్రత్యేక సదుపాయం కల్సిస్తున్నట్లు తెలిపారు.