మే 10 వరకూ గరీబ్‌ యోజన డిక్లరేషన్‌

మే 10 వరకూ గరీబ్‌ యోజన డిక్లరేషన్‌


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) కింద డిక్లరేషన్లను మే 10 వరకూ దాఖలు చేసుకునే అవకాశాలన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ కల్పించింది.


‘‘పన్ను, సర్‌చార్జ్, జరిమానాలను మే 31వ తేదీ, ఏప్రిల్‌ 30లోపు డిపాజిట్‌ చేసిన వారు ఇందుకు సంబంధించి తమ డిక్లరేషన్‌లను సమర్పించుకోడానికి మే 10 వరకూ అవకాశాన్ని కల్పించడం జరిగింది’’ అని ఒక ఉన్నతాధికారి తెలిపారు. డిపాజిట్‌ గడువును తాజాగా ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ నెలరోజులపాటు ఇటీవలే పొడిగించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top