పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై రేపు నిర్ణయం!

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై రేపు నిర్ణయం! - Sakshi

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపుపై మంగళవారం సాయంత్రం కేంద్రప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. 

 

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వదేశానికి తిరిగి రాగానే చమురు ధరల తగ్గింపుపై ఓ ప్రకటన చేస్తారన్నారు. మంగళవారం సాయంత్రం అమెరికా పర్యటన ముగించుకుని భారత దేశానికి ప్రయాణమవుతారన్నారు. 

 

లీటర్ పెట్రోల్ ధరపై 1.75 రూపాయలు, డీజిల్ పై 1 రూపాయి తగ్గే అవకాశముంది. 

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top