కొత్త ఐటీ రిటర్న్ ఫామ్‌ల పునఃసమీక్ష

కొత్త ఐటీ రిటర్న్ ఫామ్‌ల పునఃసమీక్ష


న్యూఢిల్లీ: కొత్త ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫామ్‌లోని కొన్ని అంశాలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో వీటిని పునఃసమీక్షించనున్నట్లు కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. ఐటీఆర్ ఫామ్‌లను మరింత సరళం చేయాలంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఫామ్‌ల ద్వారా బ్యాంకు ఖాతాలు, విదేశీ పర్యటనలు, ఆధార్ నంబర్ మొదలైన వాటికి సంబంధించి అవసరమైన దానికన్నా ఎక్కువ సమాచారాన్ని పన్నుల శాఖ రాబట్టేందుకు ప్రయత్నిస్తోం దంటూ పన్నుల నిపుణులు, చెల్లింపుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తిన దరిమిలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top