లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. సెన్సెక్స్ పాయింట్ల 165 లాభంతో 26,689దగ్గర, 53 నిఫ్టీ పాయింట్ల లాభంతో 8,181దగ్గర ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్ భారీ లాభాలతో దూసుకుపోతోంది.
బ్రెగ్జిట్ పరిణామాలనుంచి యూరోపియన్, అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లోకి మారడం దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. అలాగే 7వ వేతన సంఘం సిఫారసులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేస్తుందనే అంచనాలు కూడా మార్కెట్లకు బలాన్నిచ్చాయి. అటు కరెన్సీ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి 19 పైసలు లాభపడింది. 67.96 దగ్గర రూపాయి విలువ ఉంది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ లో అమెరికా కరెన్సీ డాలర్ ఎగుమతిదారులు, బ్యాంకుల అమ్మకాలు భారీగా పెరగడంతో రూపాయి బలపడుతోంది. బంగారం ధరలు కూడా పాజిటివ్ గానే ఉన్నాయి.