తెలుగు రాష్ట్రాల్లో‘ఆహా ట్యాక్సీస్’ విస్తరణ
హైదరాబాద్: ఇతర ప్రాంతాల ప్రయాణ సేవలందించే ట్యాక్సీ సేవల సంస్థ... ‘ఆహా ట్యాక్సీస్’ తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తమ కార్యకలాపాలు విస్తరించింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, శ్రీశైలం, వైజాగ్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు మొత్తం 20 పైగా ప్రాంతాల్లో సర్వీసులు ప్రారంభించినట్లు ఆహా ట్యాక్సీస్ సీఈవో అమిత్ గ్రోవర్ చెప్పారు. సాధారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు రెండు వైపుల చార్జీలు కట్టాల్సి ఉంటోందని, ఆహా ట్యాక్సీస్లో ప్రయాణిస్తే కిలోమీటర్ల లెక్కన ఒకవైపు ప్రయాణానికి చెల్లిస్తే సరిపోతుందని.. తద్వారా 40 శాతం దాకా ఆదా చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
మరిన్ని వార్తలు